అడల్ట్ మూవీస్ చేస్తే తప్పేంటీ? దర్శకుడు కమిట్మెంట్ అడగలేదు, శ్రీరెడ్డి మాత్రం చేసేవన్నీ చేసి... 

First Published Aug 15, 2022, 3:25 PM IST

బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ నటించిన మూవీ కమిట్మెంట్. విడుదల సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెరకెక్కించిన ఈ మూవీలో పరిశ్రమలో హీరోయిన్స్ కి ఎదురయ్యే పరిస్థితులు,లైంగిక వేధింపులు వంటి సమస్యలు చర్చించనున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో తేజస్వి మడివాడ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. 
 

tejaswi madivada

టాలీవుడ్ లో నా ప్రయాణం మొదలై 9 ఏళ్ళు అవుతుంది. 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి. ఇంత వరకు నాకు బ్రేక్ రాలేదు. సాలిడ్ బ్రేక్ వచ్చేవరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బిగ్ బాస్ షో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై మాత్రం నాకు మంచి సినిమా పడలేదు.

అవకాశాలు లేకపోవడం వలనే అడల్ట్ కంటెంట్ మూవీస్ లో నటిస్తున్నాని కొందరు అంటున్నారు. అవకాశాలు దండిగా ఉన్నప్పుడు కూడా నేను అడల్ట్ కంటెంట్ చిత్రాలు చేశారు. కెరీర్ బిగినింగ్ లోనే ఐస్ క్రీం వంటి బోల్డ్ మూవీలో నటించాను. ప్రతి ఒక్కరి జీవితంలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఆ తరహా చిత్రాల్లో నటిస్తే తప్పేముంది.

కమిట్మెంట్ మూవీ దర్శకుడు నన్ను ఎటువంటి కమిట్మెంట్ అడగలేదు. ఆయన అలా చేస్తే సరిగా నటించేదాన్ని కాను. గిల్లి గిచ్చి నటించమంటే చేయడం చాలా కష్టం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది తరచుగా వినిపించే మాట. అందుకే ఈ సబ్జెక్టు పై మూవీ చేయడం జరిగింది. ఇది మహిళా సాధికారిత గురించిన చిత్రం.


ఇక తెలుగు డర్టీ పిక్చర్ గా కమిట్మెంట్ చిత్రాన్ని చెప్పవచ్చు. డర్టీ మూవీలో డర్టీ లేకుండా ఉండదు. ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక కెరీర్ బిగింనింగ్ లోనే పూరి, రామ్ గోపాల్ వర్మ, శ్రీకాంత్ అడ్డాల వంటి స్టార్ దర్శకుల వద్ద పని చేయడం వలన ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసింది. మా మూవీలో రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది. 

Tejaswi Madivada

కమిట్మెంట్ మూవీలో శ్రీరెడ్డి గురించి కూడా ఉంటుంది. ఏదైనా అనిపిస్తే చేసేయాలి. శ్రీరెడ్డి మాత్రం చేసేవన్నీ చేస్తూ ఇతరులపై ఆరోపణలు చేస్తుంది. అలా ఎందుకు చేస్తుందో అర్థం కాదు. కమిట్మెంట్ మూవీలో నా పాత్ర పేరు తేజస్వి. నిజ జీవితంలో నా పాత్రను నేను ఈ మూవీలో చేశాను... అని తేజస్వి చెప్పుకొచ్చారు. కాగా ఆగస్టు 19న కమిట్మెంట్ విడుదల కానుంది.

మహేష్-వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో గోదావరి జిల్లా అమ్మాయిగా తక్కువ నిడివి కలిగిన పాత్ర చేశారు. మహేష్ తో కూడా ఆమెకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు. 


బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. ఇటీవల హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం పాల్గొన్నారు. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు.  
 

click me!