అనంతరం ఐటెమ్ నంబర్స్ గేమ్ పెట్టారు నాగార్జున. ఇందులో ఆయన వస్తువుల ఫోటోలను చూపిస్తే ఆ వస్తువుపై ఉన్న పాట ఏంటో చెప్పాల్సి ఉంది. ఇందులో ఇంటి సభ్యులను రెండు టీమ్లుగా విడగొట్టారు. రేవంత్, చంటి, ఆర్జేసూర్య, అభినయశ్రీ, సత్యశ్రీ, నేహా, ఆరోహి, మేరినా, అర్జున్, కీర్తి ఏ టీమ్లో ఉన్నారు. మిగిలిన వాళ్లు బి టీమ్లో ఉన్నారు. ఇందులో ఎక్కువగా పాటలు కరెక్ట్ గా చెప్పి ఏ టీమ్ విన్నర్గా నిలిచింది.