కన్నీళ్లు పెట్టుకున్న మానస్, సన్నీ.. కాజల్ ను కార్నర్ చేసి జైలుకు పంపిన హౌస్ మేట్స్

First Published Oct 9, 2021, 7:36 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
 

బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
 

 ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు గేమ్స్ లలో బాగా లీనమవుతున్నారు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూద్దాం.
 

నిన్నటితో 34 ఎపిసోడ్ పూర్తి కాగా.. ఇక ఐదో వారం కెప్టెన్ పోటీదారుల టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కెప్టెన్ గా రవి, ప్రియా, ఆనీ, శ్వేత లు కెప్టెన్ కోసం పోటీపడగా ప్రియ కెప్టెన్ గా నిలిచింది.
 

ఇక మానస్, సన్నీ మాత్రం బాగా బాధపడుతున్నారు. రవి ప్రియకు కెప్టెన్ బాధ్యతల గురించి వివరిస్తున్నాడు. ఇక ప్రియాంక మానస్ కి రేషన్ మేనేజర్ ఇవ్వమని కోరుతుంది.

తర్వాత మానస్, ప్రియాంక ల మధ్య చిన్న ఎమోషనల్ టచ్ జరగడంతో ప్రియాంక బాధపడింది. నిజానికి ప్రియాంకకు మానస్ ఇష్టం ఉండటంతో మానస్ మాత్రం ఆమెను దూరం పెడుతున్నాడు.
 

ఇక రవి ప్రియ దగ్గరికి వెళ్లి కాజల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఒక రాయి అంటూ ఆమె ఎవరికీ కరగదు అంటూ కాజల్ గురించి ఓ రేంజ్ లో విమర్శలు చేశాడు.
 

ఇక బిగ్ బాస్ ఎవరు చెత్త పర్ఫార్మర్ అనే ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో వాళ్ళను బంధించి వాళ్ళ ముఖంపై నీటిని చల్లమని తెలిపారు. ఎక్కువ నీళ్లు ఎవరికి పడతాయో వాళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
 

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లందరూ తమకు నచ్చని కంటెస్టెంట్ ల చెత్త పర్ఫార్మర్ గురించి చెబుతూ టాస్క్ లో పాల్గొన్నారు. ఇక మధ్య మధ్యలో కాస్త మాటల యుద్ధం కూడా జరిగింది.
 

అక్కడ కూడా కాజల్ కు క్లాస్ పీకాడు రవి. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్ లు కూడా టాస్క్ లో పాల్గొనగా ఎక్కువమంది కాజల్ నే టార్గెట్ చేశారు. దీంతో ఆమె చెత్త పర్ఫామర్ గా నిలవడంతో ఆమె జైలుకు వెళ్లాలని బిగ్ బాస్ తెలిపారు. మొత్తానికి ఈ టాస్క్ లో కొన్ని గుణపాఠాలు జరిగాయి.

click me!