నీరసంగా సాగుతున్న బిగ్ బాస్‌.. ఊపు తెచ్చేందుకు వైల్డ్ కార్డ్స్‌ రెడీ!

First Published Sep 10, 2020, 7:07 PM IST

ఈ సారి బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన వారిలో పెద్దగా సెలబ్రిటీలు లేకపోవటం. ఉన్న వారు కూడా యాక్టివ్‌గా లేకపోవటంతో షోకు ఊపు తెచ్చేందుకు బిగ్‌ బాస్‌ టీం ప్రయత్నిస్తోంది. అయితే షోకు హైప్‌ తీసుకువచ్చేందుకు ముందునుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న షో నిర్వాహకులు కొన్ని ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

తెలుగు టీవీల్లో బిగ్ బాస్‌ సందడి మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎంటర్‌టైన్మెంట్ నెవ్వర బిఫోర్‌ అని ముందే చెప్పటంతో అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తొలి రెండు రోజుల్లో ఆ అంచనాలే ఏ మాత్రం అందుకోలేకపోయింది బిగ్ బాస్‌. అనవసరమై డ్రామాతో పాటు కంటెస్టెంట్‌లు కావాలనే గొడవపడుతున్నట్టుగా అనిపించటంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
undefined
అసలు ఈ సారి హౌస్‌లోకి వెళ్లిన వారిలో పెద్దగా సెలబ్రిటీలు లేకపోవటం. ఉన్న వారు కూడా యాక్టివ్‌గా లేకపోవటంతో షోకు ఊపు తెచ్చేందుకు బిగ్‌ బాస్‌ టీం ప్రయత్నిస్తోంది. అయితే షోకు హైప్‌ తీసుకువచ్చేందుకు ముందునుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న షో నిర్వాహకులు కొన్ని ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
undefined
షోకు ఊపు తీసుకువచ్చేందుకు కాస్త ఫేం ఉన్న ఆర్టిస్ట్‌లను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు యూనిట్‌. ఇప్పటికే కొన్ని పేర్లు ఫైనల్‌ అయినట్టుగా కూడా తెలుస్తోంది. వీరిలో బుల్లితెర నటులతో పాటు సినీ నటులు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది..
undefined
జబర్థస్త్‌ ఫేం ముక్కు అవినాష్, ఈ రోజుల్లో ఫేం సాయి కుమార్‌, జంప్‌ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతీ దీక్షిత్ లాంటి వారి పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్‌లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో వీరి పేర్లు కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో కూడా వినిపించినా వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ కోసమే వారి ఆపినట్టుగా ప్రచారం జరుగుతోంది.
undefined
మరి వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీతో అయిన బిగ్‌ బాస్‌ హౌస్‌లో జోష్‌ వస్తుందా..? మౌస్‌లో సెలబ్రిటీలు లేని లోటును వైల్డ్ కార్డ్‌ ఎంట్రీస్ తీరుస్తారా..? అన్నది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
undefined
click me!