పూరి జగన్నాథ్, ఛార్మికి బిగ్ రిలీఫ్..మొత్తానికి నష్టాల నుంచి బయట పడ్డారు

First Published Jul 26, 2024, 3:38 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు. కానీ పూరి జగన్నాధ్, ఛార్మి కష్టాలు తీరిపోయినట్లు ఉన్నాయి. 

Puri Jagannadh

ఫిలిం ఛాంబర్ ద్వారా పూరి, ఛార్మి ఈ సమస్యని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి పూరి జగన్నాథ్ కి సమస్యలు ఎదురయ్యాయి. ఛార్మి, పూరి లైగర్ చిత్రాన్ని వరంగల్ శీనుకి అమ్మారు. నష్టాలతో తమకి సంబంధం లేదు అన్నట్లుగా అగ్రిమెంట్ ఉంది. 

Latest Videos


ఆ అగ్రిమెంట్ ని పూరి, ఛార్మి ఫిలిం ఛాంబర్ లో చూపించారట. దీనితో ఫిలిం ఛాంబర్ వీరికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై ఎవరూ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఇబ్బంది పెట్టడానికి లేదు అని ఫిలిం ఛాంబర్ తెలిపింది. 

ఒక వేళ పూరి నైతిక భాద్యత వహించి లైగర్ తో నష్టపోయిన వారికీ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని అమ్ముకోవచ్చు. అది పూర్తిగా పూరి జగన్నాధ్ ఛార్మి ల ఇష్టం. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 115 కోట్ల వరకు ఓవరాల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

click me!