ఆ తర్వాత `స్నేహమంటే ఇదేరా`, `వాసు`, `ఒక్కడు`, `మిస్సమ్మ`, `సింహాద్రి`, `సాంబ`, `నా ఆటోగ్రాఫ్`, `జై చిరంజీవ`, `మాయా బజార్`, `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` చిత్రాలతో పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. `అనసూయ`, `మిస్సమ్మ`, `అమరావతి` చిత్రాలు ఆమెని నటిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి.