మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్(Bheemla Nayak) తెరకెక్కింది. బిజూ మీనన్, పృథ్విరాజ్ చేసిన పాత్రలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చేశారు. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. త్రివిక్రమ్ ఎంట్రీతో ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా సన్నివేశాలు, కథలో చిన్న చిన్న మార్పులు చేశారు.