ఎవరిని నమ్మొద్దంటూ బండ్ల గణేష్‌ షాకింగ్‌ ట్వీట్లు.. ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్న పవన్‌ ఫ్యాన్స్.. నెట్టింట రచ్చ..

First Published Dec 20, 2022, 10:13 PM IST

బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్లు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు గానీ, ప్రస్తుతం అవి నెట్టిం రచ్చ లేపుతున్నాయి. పవన్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాయి.

బండ్ల గణేష్‌.. సోషల్‌ మీడియాకి, చిత్ర పరిశ్రమకి బాగా సుపరిచతమైన పేరు. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన స్టయిల్‌. అవతలి వ్యక్తి ఎవరనేది ఆయన పట్టించుకోరు. చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా, బోల్డ్ గా చెప్పేస్తాడు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంటాడు. తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాడు. నిన్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్ ని బ్లాక్‌ మెయిలర్‌ అంటూ ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశాడు బండ్ల గణేష్‌. 

తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్లు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు గానీ, ప్రస్తుతం అవి నెట్టిం రచ్చ లేపుతున్నాయి. పవన్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాయి. దీనిపై ఓ వైపు పవన్‌ ఫ్యాన్స్, మరోవైపు వైసీపీ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. బండ్ల గణేష్‌పై కామెంట్లు చేస్తున్నారు. హాట్‌ టాపిక్‌గా మార్చుతున్నాయి. ఇంతకి బండ్ల గణేష్‌ ఏం పోస్ట్ చేశాడనేది చూస్తే.. 

`జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెబుతున్నా. దయజేసి ఎవరిని నమ్మకండి. ఎవ్వరూ మనకు సహాయం చేయరు. ఎవరూ మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత మళ్లీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ. ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే, కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. 

Bandla Ganesh -suma

మీ అందరికి చెబుతున్నా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరినైనా నమ్మామా, మన గొంతు మనం కోసుకున్నట్టే. ప్లీజ్‌ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి. మీ శక్తితో మీరు పోరాడండి, ఎంత పెద్దోదైనా గౌరవించండి, కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి` అని హితబోధ చేశాడు బండ్ల గణేష్‌. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది క్లారిటీ లేదు. కానీ పవన్‌ ఫ్యాన్స్ ఫైర్‌ అవుతుండటం గమనార్హం. 

`నీన్ను వాడుకున్నది ఎవరనీ, `గబ్బర్‌ సింగ్‌ స్పెషల్‌ షోస్‌ వేయమంటే యాభై వేలు అడిగావ్‌ అని, ఫ్యాన్స్ తో ఆడుకునేది ఇలానేనా? నీయంత వెర్రి పుష్పం ఎవరు ఉండరులే అని, నిన్ను ఎవరైనా వాడుకుంటారా అది సాధ్యమేనా? అని ఫైర్‌ అవుతున్నారు. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ని తప్ప ఎవరినైనా అను అని, ఆయన జోలికి రావద్దంటున్నారు. ఇంకోవైపు బండ్ల గణేష్‌ చెప్పింది నిజమే అని మరికొందరు అంగీకరిస్తుండటం విశేషం. అలాగే వైసీపీ అభిమానులు బండ్ల గణేష్‌కి కౌంటర్లిస్తున్నారు. పవన్‌, బాబులను వీడండి అంటూ హితభోద చేస్తున్నారు.
 

ఏదేమైనప్పటికీ బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పవన్‌ కి తాను వీరాభిమానిగా భావిస్తుంటారు గణేష్‌. ఆయన్ని దేవుడిగా కొలుస్తుంటారు. `దేవర`గా పిలుస్తుంటారు. ఈవెంట్లలో పవన్‌ నామస్మరణం చేస్తాడు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరిచేస్తారు. ఆయనతో చేసిన `గబ్బర్‌ సింగ్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని అప్పుల నుంచి బయటపడ్డారు. అందుకే పవన్‌ అంటే అంతటి వీరాభిమానం చూపిస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పట్లో కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండ్ల గణేష్‌ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి అనేది ఆసక్తికరంగా మారాయి. దీనికి పవన్‌ ఫ్యాన్స్ ఫైర్‌ అవడం ఆశ్చర్యపరుస్తుంది. 

click me!