ఆ స్టార్ హీరో కోసం రాసిన కథతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ? బాలయ్య వారసుడు రిస్క్ చేస్తున్నాడే!

First Published Mar 18, 2024, 7:24 PM IST


హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరోకి రాసిన కథతో లాంచ్ చేస్తున్నారట. ఎన్నికల అనంతరం ఈ మూవీ పట్టాలెక్కనుందట. 
 

బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇరవైఏళ్ళ దాటగానే వారసులు రంగంలోకి దిగుతారు. సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలయ్య టీనేజ్ లోనే నటుడిగా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే స్టార్ అయ్యాడు. 

మోక్షజ్ఞ ఏజ్ దాదాపు మూడు పదులకు చేరింది. గత ఐదేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. బాలయ్య ప్రతిసారి త్వరలోనే మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేస్తున్నాం అంటాడు. అవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. కార్యరూపం దాల్చడం లేదు. 
 


ఆదిత్య 369 సీక్వెల్ సిద్ధం అవుతుంది. ఆ మూవీలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. దర్శకత్వం కూడా నేనో చేయవచ్చని బాలయ్య గతంలో చెప్పాడు. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఓ స్టార్ హీరోకి రాసుకున్న కథతో దర్శకుడు బోయపాటి శ్రీను మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నాడట. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. 

Mokshagna

దర్శకుడు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి చాలా కాలం అవుతుంది. అల్లు అర్జున్ కి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ క్రమంలో ఆ కథతో మోక్షజ్ఞ హీరోగా మూవీ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ఏపీలో ఎన్నికల హడావుడి ముగిశాక మోక్షజ్ఞ-బోయపాటి శ్రీను మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. 


అయితే అల్లు అర్జున్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని రాసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మోక్షజ్ఞకు సెట్ అవుతుందా? అప్పుడే ఇంత పెద్ద భారం మోక్షజ్ఞ మీద మోపడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇది పుకారు మాత్రమే. ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక చూడాలి బాలయ్య తన వారసుడిని ఎలా పరిచయం చేస్తాడో... 
 

click me!