సావిత్రి అంత్యక్రియలకు హాజరైన ఏకైక ఈ తరం హీరో ఎవరో తెలుసా?

First Published Oct 27, 2024, 12:29 PM IST


ఈ జనరేషన్ హీరోల్లో చిరంజీవి మాత్రమే సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయినా సావిత్రి అంత్యక్రియలకు రాలేదు. కానీ ఈ తరం హీరో ఒకరు హాజరయ్యారు. 
 


సావిత్రి జీవితం విషాదమయం. ఆమె కెరీర్ ప్రారంభంలో మాత్రమే సంతోషంగా ఉంది. జెమినీ గణేశన్ ని రహస్య వివాహం చేసుకున్నాక సావిత్రికి కష్టాలు మొదలయ్యాయి. అటు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. జెమినీ గణేష్ కి అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నారు. దాంతో ఆయన మొదటి భార్య సావిత్రిని తిరస్కరించింది. 

Savitri

లక్షల రూపాయల ఆస్తులు సంపాదించినా ఆమెకు మనశ్శాన్తి లేకుండా పోయింది. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ ని కూడా ఆమె దూరమయ్యారు. ఒంటరితనాన్ని, భర్త దూరమైన వేదనను మర్చిపోవడానికి సావిత్రి మద్యానికి బానిస అయ్యారు. ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. సావిత్రి 1980లో బెంగుళూరు వెళ్లారు. అక్కడ చాణక్య హోటల్ లో బస చేశారు. అక్కడే ఆమె కోమాలోకి వెళ్లారు. 

అనంతరం ఆమెను చెన్నైకి తరలించారు. 19 నెలలు సుదీర్ఘ కాలం సావిత్రి కోమాలో ఉన్నారు. ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. సావిత్రి అంత్యక్రియలకు ఎంజీఆర్, ఏఎన్నార్, జయసుధ, గుమ్మడి, భారతీ రాజా తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు సావిత్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్ళు, ప్రేమ తరంగాలు చిత్రాల్లో సావిత్రి నటించారు. అయినప్పటికీ చిరంజీవి సావిత్రి అంత్యక్రియలకు హాజరు కాలేదని సమాచారం. ఈ తరం నటుల్లో  బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారట. అందుకు కారణం... ఎన్టీఆర్ వెళ్లలేకపోయారట. ఆ కుటుంబం నుండి బాలకృష్ణ వెళ్లారట. 
 

Latest Videos


Savitri


సావిత్రి  నట ప్రస్థానం పరిశీలిస్తే... తెలుగు అమ్మాయి అయిన సావిత్రి నాటకాలు ఆడేవారు. అదే ఆమెను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేలా చేసింది.  సావిత్రి పెదనాన్న ఆమెకు నృత్యంలో శిక్షణ ఇప్పించాడు. పెదనాన్నతో పాటు మద్రాస్ వెళ్లిన సావిత్రి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరీ చిన్న వయసు కావడంతో మొదట్లో ఆమెకు ఆఫర్స్ రాలేదు. పాతాళ భైరవి చిత్రంలో చిన్న పాత్ర చేసింది. 1952లో సావిత్రికి ఫిమేల్ లీడ్ రోల్ చేసే అవకాశం దక్కింది. పెళ్లి చేసి చూడు చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది. ఆ మూవీ కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది. 

దేవదాసు మూవీతో సావిత్రి ఫేమ్ రాబట్టింది. నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏఎన్నార్, సావిత్రి చాలా గొప్పగా నటించారు. ఇక మిస్సమ్మ చిత్రంలో సావిత్రి చేసిన మేరీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. మిస్సమ్మ మూవీ ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నప్పటికీ సావిత్రి పాత్ర డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. 


మాయాబజార్ మూవీలో సావిత్రి శశిరేఖ పాత్ర చేసింది. ఆ పాత్రలో సావిత్రి నటనకు సౌత్ ఇండియన్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఒక దశలో సావిత్రి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు కూడా అంత ఇచ్చేవారు కాదు. సావిత్రికి అంత డిమాండ్ ఉండేది. ఈ క్రమంలో భారీగా ఆస్తులు ఆమె ఆర్జించారు. 

మద్రాస్ లో పెద్ద భవంతి నిర్మించుకున్నారు. గృహప్రవేశానికి తెలుగు, తమిళ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులందరినీ సావిత్రి ఆహ్వానించారు. నగలు, పట్టు చీరలు , సిరి సంపదలతో సావిత్రి తుల తూగింది. అదే సమయంలో అధిక సంపాదన ఆమె కొంప ముంచింది. ఆదాయపన్ను వంటి విషయాలపై పెద్దగా అవగాహన లేని సావిత్రి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. 

click me!