షూటింగ్ లొకేషన్ లో సహనం కోల్పోయిన బాలయ్య, కాస్ట్యూమ్ వర్కర్ పై ఆగ్రహం ?

First Published Nov 29, 2022, 2:48 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఇటీవల ఈ చిత్ర షూటింగ్ టర్కీలో జరిగింది. అక్కడ చోటు చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలయ్య కోపం కట్టలు తెంచుకోవడంతో పెద్ద రభసే జరిగిందట. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న కాస్ట్యూమ్ వర్కర్ పై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

సినిమా వర్క్ పట్ల బాలయ్య దర్శకుడు, నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ క్రమంలో కాస్ట్యూమ్ వర్కర్ పై కూడా సహనం కోల్పోయారట. బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ సమయంలో షూటింగ్ లొకేషన్ లో నిర్మాతలు కూడా లేకపోవడంతో బాలయ్య మరింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది. 

సినిమాకి సంబంధించిన వర్క్ దర్శకుడు, నిర్మాతలు దగ్గరుండి చూసుకోవాలి కదా అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య కోపంతో సదరు కాస్ట్యూమ్ వర్కర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడు షూటింగ్ కి కూడా హాజరు కాలేదట. 

ఆ తర్వాత దర్శక నిర్మాతలు ఎలాగో మ్యానేజ్ చేసి బాలయ్యని శాంత పరిచినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన సింహా సెంటిమెంట్ కొనసాగిస్తూ ఈ చిత్రానికి కూడా వీర సింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. 

ఇటీవల వీరసింహారెడ్డి చిత్రం నుంచి జై బాలయ్య అనే సాంగ్ విడుదలయింది. సాంగ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సంక్రాంతికే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం కూడా రిలీజ్ అవుతుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. 

click me!