`నర్తనశాల`కంటే ముందే బాలకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా?.. రోజాతో ఆ సీన్లు.. దానివల్లే సూపర్‌ హిట్‌

First Published Jul 2, 2024, 7:38 AM IST

బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ సినిమాని డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇప్పటికే రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు. `నర్తనశాల`కు ముందే తన డైరెక్షన్‌ స్కిల్స్ కి పని చెప్పాడట. 
 

Balakrishna

బాలకృష్ణ మాస్‌ హీరోగా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపడంలో ఆయన తర్వాతే ఎవరైనా. మాస్‌ ఫాలోయింగ్‌ విషయంలో ఆయనకు మించి ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆయన పవర్‌ ఫుల్‌ డైలాగులు, మాస్‌ యాక్షన్‌ సీన్లు ఉండాల్సిందే. రెగ్యూలర్‌గా అనిపించినా, అవి ఉంటేనే బాలయ్య సినిమా. లేదంటేజనాలకు ఎక్కదు. అంతగా డైలాగులు, యాక్షన్‌ సీన్లకు కేరాఫ్‌గా నిలిచారు బాలయ్య. 
 

బాలకృష్ణ ఒక సారి కథ నచ్చితే సినిమాలో ఇన్‌వాల్వ్ కారు. కథలోగానీ, డైరెక్షన్‌లోగానీ ఎలాంటి మార్పులు చెప్పరు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తాడు. ఫలితాలను పట్టించుకోరు. తన వరకు బెస్ట్ ఇస్తారు బాలయ్య. అందుకే ప్రతి దర్శకుడు ఆయన్ని ఇష్టపడుతుంటారు. భయట ఆయన గురించి రకరకాల ప్రచారం ఉన్నా, బాలయ్య మనసు వెన్న అని చెప్పే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. 
 

Latest Videos


ఇదిలా ఉంటే బాలకృష్ణ దర్శకుడిగా మారతాడని, తన తనయుడు మోక్షజ్ఞ సినిమాని ఆయనేడైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరిగింది. మోక్షజ్ఞ హీరోగా `ఆదిత్య 369`కి సీక్వెల్ గా `ఆదిత్య 999` చేసే ఆలోచన ఉందని బాలయ్య కూడా గతంలోవెల్లడించారు. తాను డైరెక్షన్‌ చేస్తానని కూడా చెప్పాడు. కానీ అది అయ్యేలా లేదు. 
 

అయితే బాలయ్య ఇప్పటికే రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆ మధ్య పౌరాణిక చిత్రం `నర్తనశాల` ఆయన దర్శకత్వంలోనే వచ్చింది. కాకపోతే దాన్ని మధ్యలోనే ఆపేశారు. సౌందర్య చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. సగంలో ఆగిపోయిన ఆ సినిమా డబ్బింగ్‌ పూర్తి చేసి, నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశారు బాలయ్య. దీనికి అంతంత మాత్రమే స్పందన వచ్చింది. 
 

 ఈ సినిమా కంటే ముందే బాలకృష్ణ దర్శకుడిగా మారాడట. `పెద్దన్నయ్య` సినిమాని ఆయనే డైరెక్ట్ చేశాడట. దీనికి శరత్‌ దర్శకుడు. బాలయ్యని ఎక్కువగా డైరెక్ట్ చేసింది ఈ దర్శకుడే. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఆయనకు జోడీగా రోజా, ఇంద్రజ నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం వంద రోజులకుపైగా ఆడింది. 
 

 ఈ సినిమాలో బాలయ్య క్లైమాక్స్ పార్ట్ మొత్తం తనే డైరెక్ట్ చేశాడట. ప్రీ క్లైమాక్స్ నుంచ, క్లైమాక్స్ వరకు ఆయన చూసుకున్నాడట. రోజాతో చివర్లో వచ్చే సన్నివేశాలు, యాక్షన్‌ సీన్లు, రోజా చనిపోయే సీన్లు ఇలా మొత్తం బాలకృష్ణ నే డైరెక్ట్ చేశాడట. ఈ సినిమా క్లైమాక్స్ వల్లే వంద రోజులు ఆడిందని, పెద్ద హిట్‌ అయ్యిందని తెలిపారు బాలయ్య. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య  విషయన్ని బయటపెట్టారు. తనకు సోషల్‌ సినిమాలు చేయడం రాదని, లార్జర్‌ దెన్‌ లైఫ్‌, పౌరాణికాలు మాత్రమే డైరెక్ట్ చేయగలను అని తెలిపారు బాలయ్య. ఈ ఇంటర్వ్య క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` సినిమాలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లోగానీ, లేదంటే వచ్చే సంక్రాంతికిగానీ ఈ సినిమాని రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాల్గో సారి సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇద సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. 

click me!