అయితే ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా ప్రత్యేకమైన సినిమా కావడం విశేషం. చిరంజీవి, నాగార్జున కూడా గెస్ట్ లుగా మెరిశారు. వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఇలా ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్ లు మెరిశారు. అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.