యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకులు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.