రెప్పపాటు కాలంలో జరిగే ప్రమాదాలు జీవితాలనే తారుమారు చేస్తుంటాయి. అందుకే ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం అని చెబుతుంటారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. సినీ ప్రముఖులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. గత ఏడాది మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ నుంచి పడిన సంగతి తెలిసిందే. అదృష్టం బావుండి తేజు ఆ ప్రమాదం నుంచి కోలుకున్నాడు.