టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఓ అశ్విని దత్ ఒకరు. వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపించిన అశ్విని దత్ దాదాపు 50 ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో ఆయన చిత్రాలు నిర్మించారు. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన చిత్రాలు ఈయన బ్యానర్ నుంచే వచ్చాయి.