దిల్ రాజుపై అశ్విని దత్ షాకింగ్ కామెంట్స్.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇదిగో

Published : Jul 28, 2022, 03:41 PM IST

నిర్మాత అశ్విని దత్ తో ఎక్స్ క్లూజివ్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వివరించారు. సీతారామం చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని అన్నారు. అలాగే టాలీవుడ్ లో జరుగుతున్న బంద్ లు, టికెట్ ధరల సమస్య గురించి అశ్విని దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
17
దిల్ రాజుపై అశ్విని దత్ షాకింగ్ కామెంట్స్.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇదిగో

సీనియర్ ప్రొడ్యూసర్, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మించిన 'సీతారామం' చిత్రం ఆగష్టు 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రేమకాథా చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో జంటగా నటించారు. సుమంత్, రష్మిక మందన కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

27

నిర్మాత అశ్విని దత్ తో ఎక్స్ క్లూజివ్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వివరించారు. సీతారామం చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని అన్నారు. అలాగే టాలీవుడ్ లో జరుగుతున్న బంద్ లు, టికెట్ ధరల సమస్య, ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడం.. అలాగే ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి అశ్విని దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

37

కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్లు ప్రస్తుతం థియేటర్స్ కి ప్రేక్షకులు రాకపోవడం కూడా అలాంటిదే అని అన్నారు. కరోనా, ఓటిటి, టికెట్ ధరలు పెంచడం, తగ్గించడం ఇలా అనేక కారణాలు ప్రభావం చూపాయి అని అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక సెక్షన్ అయితే వాళ్లే థియేటర్స్ తీసుకుని, అందులో సమోసాలు కూడా వాళ్లే అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అని అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

47

project k

హీరోలు రెమ్యునరేషన్స్ పెంచడం, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలు అనేవి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిర్ణయించుకోవాలి. నిర్మాతలు, హీరోలు ఇన్వాల్వ్ అయి టికెట్ ధరలు పెంచడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. వీళ్ళ రెమ్యునరేషన్స్ పెంచుకోవడం టికెట్ ధరలు పెంచుతున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ప్రభావం మొదలైన తర్వాత మళ్ళీ టికెట్ ధరలు తగ్గిస్తున్నారు. 

57

ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ.. దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఆఫీస్ లో ఒక డీల్ జరుగుతుండగా విన్నాను. వాళ్ళు చెప్పిన ధరని మేము అంగీకరించలేదు. ఏంటి సర్ మీరు.. దిల్ రాజు ఆఫీస్ లో అయితే ఇలాంటి లెక్కలే అడగరు. మైత్రి మూవీస్ వాళ్ళు మేము ఎంత చెప్పినా ఒకే అంటారు అని ఒక సంస్థ మేనేజర్ అనడం నాకు తెలుసు. 

67

దీనిని బట్టి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బు తగలేసేది వీళ్ళే.. మళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అంటూ బంద్ చేసేది కూడా వీళ్ళే అంటూ అశ్విని దత్ మండి పడ్డారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు అని అన్నారు. 

77

ఇక ప్రభాస్ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బయ్యే గుడ్ న్యూస్ చెప్పారు అశ్విని దత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె అవుట్ ఫుట్ టెర్రిఫిక్ గా ఉందని అన్నారు. ఈ చిత్రాన్ని అమెరికా, చైనాతో పాటు అనేక దేశాల్లో పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేస్తాం. అవెంజర్స్ తరహాలో ఉండబోతోంది. 2023 జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుంది. 8 నెలల పాటు విఎఫెక్స్ వర్క్ ఉంటుంది. కుదిరితే 2023 అక్టోబర్ 18న రిలీజ్ చేస్తాం. అదే నెలలో ప్రభాస్ బర్త్ డే కూడా ఉంది. కుదరకపోతే 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని అశ్విని దత్ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories