జనాలకు ఇప్పుడే అర్థం అవుతోంది, అమర్ దీప్ నిజమైన హీరో.. పల్లవి ప్రశాంత్ పై పరోక్షంగా..

Published : Dec 28, 2023, 02:46 PM IST

సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా మొదటి నుంచి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఆరియానా, అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

PREV
16
జనాలకు ఇప్పుడే అర్థం అవుతోంది, అమర్ దీప్ నిజమైన హీరో.. పల్లవి ప్రశాంత్ పై పరోక్షంగా..

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసినప్పటికీ ఆ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ వేడి ఇంకా చల్లారలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. 

26

దీనితో టైటిల్ గెలిచిన సంతోషం పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యుల్లో ఆవిరైపోయింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్, అమర్ డీప్ మధ్య చాలా గొడవలు జరిగాయి. అమర్ దీప్ కంట్రోల్ కోల్పోయి పిచ్చిగా అరవడంతో అతడిపై ట్రోలింగ్ కూడా జరిగింది. 

36
Ariyana glory

అయితే సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియనా మొదటి నుంచి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఆరియానా, అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

 

46

అమర్ దీప్ తో ఉన్న ఒక వీడియో అరియనా పోస్ట్ చేసింది. అమర్ దీప్ నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. అరే పది కాకులు పది రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు నిజం రా అమర్.. నువ్వు హీరో.. జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మా అమర్ కి సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థాంక్యూ అంటూ అరియనా పోస్ట్ చేసింది. 

56

అరియనా చేసిన కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అరియనా పరోక్షంగా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తోంది అని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు అమర్, పల్లవి ప్రశాంత్ వ్యవహారంలో.. అమర్ ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు అని అర్థం వచ్చే విధంగా అరియనా పోస్ట్ చేసింది అని అంటున్నారు. 

66

హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ గా.. శోభా శెట్టి, అమర్, ప్రియాంక స్పా బ్యాచ్ గా విడిపోయి గొడవలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. షో ముగిసింది కాబట్టి ఇకనైనా వీరంతా ఫ్రెండ్స్ గా మారతారేమో చూడాలి. బిగ్ బాస్ ముగిసిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ తనకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం అని.. గొడవలు హౌస్ వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. 

click me!

Recommended Stories