ఆ ఒక్కడి కోసమే అరణ్య... ప్రీ రిలీజ్ వేడుకలో రానా!
First Published Mar 21, 2021, 5:12 PM IST
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన విక్టరి వెంకటేష్ అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, హీరోయిన్ జోయా హుస్సేన్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.