భారతీరాజా పాడిన పాట
దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన కిళక్కు సీమయిలే, కరుత్తమ్మ, తాజ్ మహల్, కణ్గళాల్ కైదు సెయ్ వంటి సినిమాలకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాల్లో పాటలన్నీ హిట్టయ్యాయి. ఏ.ఆర్.రెహమాన్తో వరుసగా నాలుగు సినిమాలు చేసిన భారతీరాజా, ఆయన సంగీతంలో ఒక పాట కూడా పాడారు. ‘ఎన్ ఇనియ తమిళ్ మక్కలే’ అని భారతీరాజా గంభీరంగా మాట్లాడటం విన్నాం. కానీ ఆయన పాడిన పాట ఏంటో తెలుసా?