అనుష్క శెట్టి దాదాపు దశాబ్దన్నరగా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూ వస్తోంది. `సూపర్`తో ప్రారంభమైన ఆమె సినిమా జర్నీ.. మొన్నటి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` వరకు విజయవంతంగా సాగింది. ఆమె ఒక్కో సినిమాకి ఎదుగుతూ వస్తోంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది.
`బాహుబలి`, `సైజ్ జీరో` తర్వాత అనుష్కలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా `సైజ్ జీరో` కోసం ఆమె బరువు పెరిగి తగ్గడంతో అది ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడింది. బరువు తగ్గడం కష్టంగా మారింది. అందుకే సినిమాలు చేయడం కూడా తగ్గించింది. బయట కనిపించడమే మానేసింది. అయితే ఇటీవల మళ్లీ సెట్ అయినట్టుంది. ఆమె లేటెస్ట్ గా మలయాళ సినిమా ఓపెనింగ్లో పాల్గొంది.
ప్రస్తుతం అనుష్క రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇందులో అనుష్క వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఆమెనే మెయిన్ లీడ్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో, అలాగే బూత్ బంగ్లాలో చిత్రీకరణ జరుపుతున్నారట. దీనికి `గాటి` అనే టైటిల్ని ఖరారు చేశారు.
మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమాకి సైన్ చేసింది, అది ఇటీవలే ప్రారంభమైంది. ఇందులోనూ తన మెయిన్ లీడ్ అని తెలుస్తుంది. అయితే ఇది అనుష్క తీసుకున్న నిర్ణయమట. ఆమె ఇకపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటించాలని డిసైడ్ అయ్యిందట. హీరో కి జోడీగా చేయడానికి నో చెబుతుందట. తనే లీడ్గా ఉండే సినిమాలకే ఓకే చెబుతుందట. ఈ రకంగా దర్శకులకు ఒక పర్ఫెక్ట్ సందేశాన్ని ఇస్తుందని అనుష్క. అలాంటి కథలతోనే తనని సంప్రదించాలని చెబుతుందట.
Anasuya Bharadwaj
ఈ నేపథ్యంలో ఇకపై అనుష్కని రొమాంటిక్ లుక్లో చూడటం కష్టమే, గ్లామర్గానూ కనిపించడం కష్టమే అని చెప్పొచ్చు. అలాగే ఇతర హీరోల సరసన హీరోయిన్గా కనిపించడం కూడా కష్టమే. ఇక స్వీటీని అలా చూడటం సాధ్యం కాదనే అంటున్నారు. ఇది ఆమె అభిమానులను కొంత నిరాశ పరిచే విషయమనే చెప్పాలి. మరి అనుష్క ఈ నిర్ణయంలోనిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది.