ముంబైలో పుట్టి ఉంటే కథ వేరేలా ఉండేది... ఇన్సల్ట్ చేసిన నెటిజెన్ కి రష్మీ స్ట్రాంగ్ కౌంటర్! 

First Published Nov 25, 2022, 10:25 AM IST


సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోల్స్ చాలా కామన్. అకారణంగా కూడా తారలు నెగిటివిటీకి గురవుతారు. విమర్శలు ఎదుర్కొంటారు. ఓ నెటిజన్ ఇన్సల్టింగ్ కామెంట్ చేయగా యాంకర్ రష్మీ చురక అంటించింది. 
 

Rashmi Gautam

ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో యాంకర్స్, బుల్లితెర సెలెబ్రిటీల స్కిన్ షో ఎక్కువైంది. ఒక విధంగా చెప్పాలంటే హద్దులు దాటేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకుంటే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చే సంపాదన పెరుగుతుంది. స్టార్ హీరోయిన్స్ వరకూ ఇదే ఫీల్ అవుతున్నారు. సూపర్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
 

కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్స్ కూడా చేస్తుంటే అరాకొరా సంపాదనతో సరిపెట్టుకుంటున్న యాంకర్స్ ఊరుకుంటారా?. వారిని మించి వీరు స్కిన్ షో చేస్తున్నారు. శ్రీముఖి, అనసూయ, అషురెడ్డి, రష్మీ గౌతమ్ అందాల ప్రదర్శనలో రెచ్చిపోతున్నారు. 

Sreemukhi

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ మీమర్ సెటైర్ వేశాడు. వారి హాట్ ఫోటోలన్నీ కలిపి.. వీరు హీరోయిన్స్ కాదు మావా, హీరోయిన్స్ కావాలని ఆశపడి కుదరక ఉండిపోయిన వాళ్ళు' అని మీమ్ వేశాడు. ఇది రష్మీ దృష్టికి రావడంతో ఆమె స్పందించారు. సదరు నెటిజెన్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 
 


అవును నిజమే.. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ మిస్ అయ్యారు. ఫొటోలో ఉన్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. అదే ముంబై బోర్డింగ్ పాస్ ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకున్న బట్టలు ట్రెండ్ సెట్ చేసేవి. ఏదేమైనా ఎంకరేజ్మెంట్ కి ధన్యవాదాలు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. రష్మీ కామెంట్ వైరల్ గా మారింది. 

Rashmi Gautam


ముంబై హీరోయిన్స్ ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్లేదు. పైగా వారు వేసుకుంటే అద్భుతం అంటూ పొగుడుతారు. అదే మేము ధరిస్తే మాత్రం మీకు చులక అన్న అర్థంలో రష్మీ... ఆ కామెంట్ చేశారు. తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో గుర్తింపు ఉండదు. అవకాశాలు ఇవ్వరూ, అనే అసహనం కూడా రష్మీ కామెంట్ ద్వారా తెలుస్తుంది. 
 

click me!