ఛీ ఛీ.. హైపర్ ఆదితో దగ్గరుండి అమ్మాయితో ఆ పని చేయించిన రష్మీ... ఇలా తయారయ్యారేంటి బాబోయ్!

First Published Apr 23, 2024, 12:22 PM IST

ఎంటర్టైన్మెంట్ పేరుతో రోజు రోజుకు బుల్లితెర షోల్లో అశ్లీలత పెరిగిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు మధ్య అశ్లీలతతో కూడిన ఆటలు, హగ్గులు, ముద్దులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది హద్దులు దాటేశాడు. 
 

ఒకప్పుడు బుల్లితెర పై కామెడీ చాలా హెల్తీగా ఉండేది. ఇంటిల్లపాది కలిసి చూసే కార్యక్రమాల్లో ఎక్కడా బూతు కామెడీ, డబుల్ మీనింగ్ జోక్స్, మితిమీరిన రొమాన్స్ లేకుండా మేకర్స్ ప్లాన్ చేసేవారు. 

జబర్దస్త్ వచ్చాక ఈ రూల్ కి బ్రేక్ పడింది. పొట్టిబట్టల్లో యాంకర్స్ స్కిన్ షో చేయడం. డబుల్ మీనింగ్ జోక్స్ కల్చర్ పెరుగుతూ వచ్చింది. ఒక దశలో జబర్దస్త్ కామెడీలో బూతు కంటెంట్ మితిమీరి పోయింది. విమర్శలు తలెత్తడంతో డోసు తగ్గిస్తూ వచ్చారు. 
 

Rashmi Gautam

మరలా బుల్లితెర కామెడీ షోలలో అశ్లీలత ఎక్కువవుతుంది. బుల్లితెర కమెడియన్స్ మొత్తం కలిసి చేసే శ్రీదేవి డ్రామా కంపెనీలో తాజాగా హైపర్ ఆది, కర్లీ సీత రెచ్చిపోయారు. ఆమెను గట్టిగా హత్తుకోవడం, పైకి ఎత్తుకోవడం చేశాడు హైపర్ ఆది. ఇవన్నీ యాంకర్ రష్మీ దగ్గరుండి చేయించింది.

Rashmi Gautam


యూట్యూబ్ లో అడల్ట్ కామెడీతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కర్లీ సీత పాప్యులర్ అయ్యింది. ఆమె బ్లాక్ బస్టర్ మూవీ బేబీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసింది. కర్లీ సీత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రావడమైంది. పొట్టి నరేష్, హైపర్ ఆది మధ్య ఒక గేమ్ కండక్ట్ చేసింది రష్మీ గౌతమ్. 

Rashmi Gautam

ఈ గేమ్ లో భాగంగా పొట్టి నరేష్ ని ఒక అమ్మాయి చేతుల్లోకి తీసుకుంది. హైపర్ ఆది, కర్లీ సీత గట్టిగా హత్తుకుని ఒక బాక్స్ లో నిల్చున్నారు. కర్లీ సీత తన కాళ్ళు నేలకు తగలకుండా హైపర్ అది కాళ్ల మీద నిలుచుంది. ఆమెను హైపర్ ఆది గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. ''ఏం యాంకర్స్ అయ్యా వీరు మీరే దగ్గరుండి ఇలా కలుపుతారు అనుకుంటే' అన్నాడు. 
 

Rashmi Gautam

మీరు ఆ బాక్స్ నుండి బయటకు వచ్చి గేమ్ కంప్లీట్ చేయమని యాంకర్ రష్మీ చెప్పింది. మేము గంట అయినా కూడా బాక్స్ నుండి బయటకు రాను అన్నాడు హైపర్ ఆది. మరీ పచ్చిగా హగ్ చేసుకోవడం, గాల్లోకి ఎత్తడం చేస్తూ హైపర్ ఆది రొమాన్స్ కురిపించాడు. సెట్స్ లో ఉన్నవారందరూ దీన్ని ఎంజాయ్ చేశారు 
 


సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ పేరుతో దిగజారిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ హైయెస్ట్ టీఆర్పీ షోలలో ఒకటిగా ఉంది. 
 

click me!