మనం కలిసే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా నాన్నః తండ్రి మరణంపై యాంకర్‌ ప్రదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్

First Published May 24, 2021, 9:26 AM IST

యాంకర్‌ ప్రదీప్ ఎమోషనల్‌ అయ్యారు. తండ్రి మరణంతో చలించిపోయిన ఆయన తాజాగా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. `మనం కలిసే వరకు మిస్‌ అవుతూనే ఉంటా నాన్న` అంటూ అందరిని కదిలించాడు. ప్రస్తుతం ప్రదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది.

టీవీలో మేల్‌ యాంకర్‌లో టాప్‌లో ఉంటారు ప్రదీప్‌. ఈటీవీ, జీ తెలుగు, స్టార్‌మా ఇలా టెలివిజన్‌ ఛానెల్‌ ఏదైనా, షో ఏదైనా అందులో ప్రదీప్‌ యాంకర్‌గా కనిపించాల్సిందే. అంతగా తన మాట చాతుర్యంతో, కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ప్రదీప్‌కి సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు.
undefined
ఇటీవల ప్రదీప్ నాన్న మాచిరాజు పాండురంగ(65)కరోనాతో కన్నుమూశారు. గత వారం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తాను కూడా ఐసోలేట్‌ అయ్యారు ప్రదీప్‌. తాజాగా తండ్రి మరణంలో ప్రదీప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.
undefined
`ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. లైఫ్‌లో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. నేను ఏం చేసినా అది మీకు గౌరవం తెచ్చే పనే చేస్తా. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు.
undefined
బాధతో ముక్కలైన నా మనస్సుని మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు ఇన్‌స్పైర్‌ చేసింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ లేదు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను.
undefined
మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టూ ఉన్నవారిని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఐ మిస్‌ యూ` అంటూ ప్రదీప్‌ పెట్టిన భావోద్వేగ భరిత పోస్ట్ ఇప్పుడు అందరిని కదిలిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది.
undefined
ప్రదీప్‌ యాంకర్‌గానే కాదు హీరోగానూ బిజీ అవుతున్నారు. ఆయన ఇటీవల `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` చిత్రంలో నటించారు. ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. హీరోగా ప్రదీప్‌కి మంచి ఫీచర్‌ ఉందనే ప్రశంసలు దక్కడం విశేషం.
undefined
click me!