Anasuya Bharadwaj
అనసూయ టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్. ఏడాదికి అరడజను చిత్రాలకు పైగా ఆమె చేస్తున్నారు. గత ఏడాది అనసూయ నటించిన రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు 1, మైఖేల్ చిత్రాల్లో ఆమె విలక్షణ పాత్రలు చేసింది.
anasuya instagram
సినిమాలతో పాటు ఆమె పలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ నగరాలను సందర్శిస్తుంది. ఎక్కడకు వెళ్లినా అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమెకు యూత్ లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
Anasuya Bharadwaj
క్షణం తీరిక లేకున్నప్పటికీ అనసూయ ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తారు. భర్త సుశాంక్, ఇద్దరు కొడుకులతో తరచుగా విహారాలకు వెళుతుంది. కుటుంబ సభ్యుల బర్త్ డేలు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తుంది. పెళ్లి రోజున భర్తతో పాటు ఒక రొమాంటిక్ టూర్ కి వెళుతుంది.
అలాంటి అనసూయ ఒంటరి ప్రయాణం చేయాలి అనుకుంటుందట. విషయంలోకి వెళితే అనసూయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని మీరు ఒంటరిగా ఒక ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా... అని అడిగాడు.
ఆ ప్రశ్నకు సమాధానంగా అనసూయ... ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు పిచ్చ భయం. కానీ ఇప్పుడు ఆలోచిస్తా. ఎక్కడికి వెళితే బెటర్? ఒక సలహా ఇవ్వమని అనసూయ సదరు నెటిజెన్ ని అడిగింది. మరో నెటిజెన్ మీరు ఎక్కడకి వెళ్లినా అక్కడ పండగే అని కామెంట్ చేశాడు.
సో స్వీట్ ఆఫ్ యూ అని అనసూయ రిప్లై ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని కూడా అనసూయ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. భర్తను వదిలేసి ఎలా విహారాలు చేస్తావని కామెంట్స్ పెడుతున్నారు.
ఈ నెగిటివ్ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. అనసూయ ప్రస్తుతం పుష్ప 2తో పాటు కొన్ని చిత్రాలు చేస్తుంది. అల్లు అర్జున్ మూవీలో ఆమె విలన్ గా చేస్తుండగా పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది.