గ్యాప్‌ దొరికితే అనసూయ చేసే పనేంటో తెలుసా?.. అసలు రహస్యం బయటపెట్టిన `జబర్దస్త్` మాజీ యాంకర్‌

Published : Jul 28, 2024, 11:15 PM ISTUpdated : Jul 29, 2024, 12:03 PM IST

మాజీ జబర్దస్త్ యాంకర్‌ అనసూయ తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టింది. ఖాళీ సమయంలో తాను చేసే పని ఏంటో వెల్లడించింది ఆశ్చర్యపరిచింది.   

PREV
16
గ్యాప్‌ దొరికితే అనసూయ చేసే పనేంటో తెలుసా?.. అసలు రహస్యం బయటపెట్టిన `జబర్దస్త్` మాజీ యాంకర్‌
Anasuya Bharadwaj

అనసూయ యాంకర్ గా కెరీర్‌ని ప్రారంభించింది. న్యూస్‌ యాంకర్‌ నుంచి సినిమాల్లోకి వచ్చింది. అడపాదడపా సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు వచ్చింది. `జబర్దస్త్` యాంకర్‌గా మారిన తర్వాత అనసూయ రేంజ్‌ మారిపోయింది. ఆమెకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఫాలోయింగ్‌ పెరిగింది. కొన్ని రోజుల్లోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగింది అనసూయ. ఈ క్రేజ్‌తోనే ఆమెకి మళ్లీ సినిమా అవకాశాలు ప్రారంభమయ్యాయి.  
 

26

చాలా సినిమాల్లో అడపాడపా మెరుస్తూనే ఉంది అనసూయ. కానీ `రంగస్థలం` మూవీ ఆమెకి బ్రేక్‌ ఇచ్చింది. రంగమ్మత్తగా అద్భుతంగా నటించి పాపులర్‌ అయ్యింది. ఇప్పటికీ ఆమెని అదే పేరుతో ఆడియెన్స్, ఫ్యాన్స్ పిలుస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నుంచి బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు బలమైన పాత్రలే చేస్తూ మెప్పిస్తుంది. కానీ రంగమ్మత్తని మరిపించే పాత్ర ఇప్పటి వరకు పడలేదు. 

 

36

ప్రస్తుతం ఆమె `పుష్ప 2`, `సింబా`, `అరి` వంటి పలు సినిమాల్లో నటిస్తుంది. అయితే లేటెస్ట్ గా అనసూయ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు తాను ఏం చేస్తుందో బయటపెట్టింది. ఖాళీ టైమ్‌ దొరికితే తాను అక్కడికి వెళ్లిపోతుందట. ఎంజాయ్‌ చేస్తుందట. అదంటే తనకు ఇష్టమని చెప్పింది అనసూయ. అదేంటో కాదు, ఫారెస్ట్. 

46

నేచర్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది అనసూయ. తనకు గ్యాప్‌ దొరికితే అడవుల్లోకి వెళ్లిపోతానని, ఫ్యామిలీతో కలిసి అలా అడవుల్లోకి వెళ్లి ఎంజాయ్‌ చేయడం ఇష్టమని చెప్పింది అనసూయ. ఇప్పటి వరకు ఇండియాలో ఫ్యామిలీతో కలిసి దాదాపు అన్నీ సఫారీలు తిరిగినట్టు చెప్పింది అనసూయ. ఒక్క గీర్‌ ఫారెస్ట్ కి మాత్రమే వెళ్లలేదని, త్వరలో అది కూడా వెళ్తానని చెప్పింది అనసూయ. 
 

56

ఈ సందర్బంగా మరో క్రేజీ విషయాన్ని వెల్లడించింది అనసూయ. తాను పోయిన జన్మలో జింకనో, మేకనో అయి ఉంటాను. అందుకే గ్రీనరీతో ఆ అనుబంధం ఉంటుందని చెప్పింది అనసూయ. తాను మణికొండలో ఉంటుందని, ఒకప్పుడు అక్కడ అంతా గ్రీనరీ, కొండలు ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు పొడుగుపొడుగు బిల్డింగ్‌లు వచ్చి, ఆ ప్రకృతిని నాశనం చేశామని తెలిపింది. హైదరాబాద్‌లో సహజంగా మెట్ట ప్రాంతమని, వరదలు వచ్చే పరిస్థితి లేదని, కానీ మనం తెలివితేటలతో చేసిన పనులకు ఇప్పుడు అన్నీవిపత్తులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది అనసూయ. 
 

66
Anasuya Bharadwaj

తాను సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. టైమ్‌ దొరికితే ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లిపోతుంది. విదేశాల్లో, గ్రీనరీలో, వాంటర్‌ఫౌంటేన్స్, బీచ్‌లు, ఫారెస్ట్ లో తిరుగుతూ, ఎంజాయ్‌ చేస్తూ కనిపిస్తుంది అనసూయ. ఆయా ఫోటోలను పంచుకుంటూ తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకుంటుంది. అదే సమయంలో గ్లామర్‌ ట్రీట్‌తోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది అనసూయ. సందడి చేస్తూ నెటిజన్లని ఖుషి చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories