దర్శకుడు సంపత్ నంది ఈ మూవీకి కథ అందించారు. ఆయనే సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ మూవీ చేయడానికి కారణం ఉదయభాను అని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసిందని, ఆ తర్వాత ఎంపీ సంతోష్, మాజీ సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే ఇలాంటి కథతో సినిమా ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా అని, కనువిప్పు కలిగేలా, ఎంటర్టైనింగ్గా, మంచి సందేశాత్మకంగా సినిమా ఉంటుంద`న్నారు సంపత్ నంది. ఇక `సింబా` చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతుంది.