స్పోర్ట్స్ ట్రాక్ లో ఇటలీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ... ఆ హీరోతో అక్కడ ఫుల్ బిజీ!

First Published Mar 17, 2021, 12:27 PM IST

హాట్ యాంకర్ అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. వెండితెరపై ఆమె ఫుల్ బిజీ అయ్యారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. అనసూయ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తున్నారు. 
 

సిల్క్ స్మిత బయోపిక్, థాంక్ యూ బ్రదర్ అనే చిత్రాలు ఆమె ప్రధానంగా తెరకెక్కాయి. థాంక్ యూ బ్రదర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
అలాగే తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఆమె ఓ రోల్ చేస్తున్నారు. ఇక మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అనసూయకు పాత్ర చేసే అవకాశం దక్కింది.
undefined
ఇక తెలుగులో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆమె దేవదాసిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.
undefined
ఓ వెబ్ సిరీస్లో కూడా అనసూయ నటిస్తుండగా.. నిహారిక మరో కీలక రోల్ చేస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక చావు కబురు చల్లగా మూవీతో ఐటెం భామగా కూడా అనసూయ మారారు. ఆ చిత్రంలో ఓ సాంగ్ లో హీరో కార్తికేయకు జంటగా కాలు కదిపారు.
undefined
కాగా అనసూయ ప్రస్తుతం ఇటలీ టూర్ లో ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో అనసూయ ఇటలీలో ఏమి చేస్తున్నారని మీకు సందేహం కలగవచ్చు. అయితే అనసూయ వెళ్ళింది విహారానికి కాదు.. పనిలో భాగంగానే.
undefined
దర్శకుడు రమేష్ వర్మ.. రవితేజ హీరోగా ఖిలాడి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో దర్శకుడు ప్లాన్ చేశాడు. ఖిలాడి మూవీలో అనసూయ ఓ రోల్ చేస్తుండగా... షూటింగ్ కోసం ఆమె అక్కడకు వెళ్లడం జరిగింది.
undefined
వరల్డ్ ఫ్యాషన్ సిటీగా పేరున్న మిలాన్ లో అనసూయ ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తూ కనిపించారు. రన్నింగ్ ట్రాక్ సూట్ లో జాగింగ్ కి వెళుతున్న తన ఫోటోను పంచుకున్న అనసూయ.. ఇటాలియన్ భాషలో.. నమస్తే మిలాన్ అంటూ కామెంట్ పెట్టారు.
undefined
రవితేజతో పాటు ఖిలాడి షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన అనసూయ షెడ్యూల్ ముగియగానే హైదరాబాద్ తిరిగిరానున్నారు.
undefined
నటిగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికి పేరు తెచ్చి పెట్టిన బుల్లితెరను అనసూయ వదలడం లేదు.
undefined
click me!