శేఖర్‌ మాస్టర్‌తో పోటీగా జాకెట్‌ విప్పిన అనసూయ.. గేమ్‌ షోలో మాజీ `జబర్దస్త్` యాంకర్‌ చేసిన పనికి అంతా షాక్‌

First Published Jun 23, 2024, 11:39 AM IST

అనసూయ డేర్‌ చేసింది. గేమ్‌ షోలో షాకిచ్చింది. శేఖర్‌ మాస్టర్‌తో పోటీ పడి ఏకంగా జాకెట్‌ విప్పి షాకిచ్చింది. దీంతో ఇప్పుడు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. 
 

అనసూయ మళ్లీ బుల్లితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాను కొత్త ద్వారా టీవీకి రీఎంట్రీ ఇస్తున్నట్టు ఆమె ఇటీవల ప్రకటించింది. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో స్టార్‌మాలో ఈ షో స్టార్ట్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అనసూయ చేసిన పనికి అంతా షాక్‌ అవుతున్నారు. 
 

`జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌ అయిన, యాంకర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌.. చివరగా ఆ షోపైనే పలు విమర్శలు చేసి బయటకు వెళ్లింది. వల్గారిటీ, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, మేనేజర్లు చేసిన పనిని తప్పుపడుతూ ఆమె షో నుంచి తప్పుకుంది. అనంతరం సినిమాల్లో బిజీ అయ్యింది. కానీ ఇప్పుడు సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో మళ్లీ బుల్లితెరబాట పట్టింది. 
 

Latest Videos


అందులో భాగంగానే స్టార్‌మాలో `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షో చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ గేమ్‌ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇందులో అనసూయ, శేఖర్‌ మాస్టర్‌ టీమ్‌ లీడర్లుగా ఉన్నారు. బాయ్స్ టీమ్‌కి శేఖర్‌ మాస్టర్‌, గర్ల్స్ టీమ్‌కి అనసూయ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో టీమ్‌ సభ్యులుగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు పాల్గొనడం విశేషం. బాయ్స్ టీమ్‌లో అమర్ దీప్‌, అర్జున్‌ అంబటి, టేస్టీ తేజ, నిఖిల్‌తోపాటు టీవీ నటులున్నారు. 
 

అమ్మాయిల్లో శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, పల్లవి, గోమతి ప్రియతోపాటు రీతూ చౌదరి, యాంకర్‌ సౌమ్యరావు వంటి టీవీ ఆర్టిస్టులు కూడా ఈ షోలో లేడీ టీమ్‌లో ఉన్నారు. ఈ రెండు టీముల మధ్య ఛాలెంజెస్‌తో కూడిన గేమ్‌లుంటాయి. ఇక ప్రారంభంలో రెండు టీమ్‌లకు సంబంధించిన కంటెస్టెంట్‌లు, టీమ్‌ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. శేఖర్‌ మాస్టర్ అదిరిపోయే డాన్స్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. 
 

అనసూయ మీరు మాతో పోటీకి వచ్చినా మీకే రిస్క్, మేము మీతో పోటీకి వచ్చినా మీకే రిస్క్ అని హెచ్చరిస్తాడు. ఈ అనసూయ అమ్మాయి పక్కన ఉన్నంత వరకు అమ్మాయిలను ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్‌ అంటూ సవాల్‌ విసురుతుంది అనసూయ. ఈ ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. 

అనంతరం లేడీ టీమ్‌ సభ్యులు పచ్చిమిర్చి, వెల్లుల్లి తీనే టాస్క్, అబ్బాయిలు ఏడ్చే టాస్క్ చేశారు. మరోవైపు లేడీ కంటెస్టెంట్‌ ఏకంగా శేఖర్‌ మాస్టర్‌ని ఎత్తుకుని తిరగడం హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ గేమ్‌ ఫైనల్‌లో ఏ టీమ్‌ అయితే విజయం సాధిస్తుందో వారికి 20లక్షల ప్రైజ్‌ మనీ ఇవ్వబోతున్నట్టు యాంకర్‌ శ్రీముఖి ప్రకటించింది. దీంతో అందరు షాక్‌ అవుతారు. 
 

అనసూయ పెద్ద షాక్‌ ఇచ్చింది. అందరి ముందు ఆమె తన జాకెట్‌ వినిపించింది. బ్రా అందాలతో కనిపించి మైండ్‌ బ్లాక్‌ చేసింది. శేఖర్‌ మాస్టర్‌తో పోటీ పడి అనసూయ తన జాకెట్‌ విప్పడం విశేషం. అనసూయ లోని డేర్‌కి అందరు షాక్‌ అయ్యారు. షోలో అందరి ముందు, పైగా శేఖర్‌ మాస్టర్‌తో పోటీ పడి ఆమె జాకెట్‌ విప్పడం విశేషం. 

మరోవైపు శేఖర్‌ మాస్టర్‌ కూడా తన షర్ట్ విప్పారు. ఇద్దరు కలిసి సర్కిల్‌లో తిరుగూ గేమ్‌ కోసం పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య సవాళ్లు, ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ టూ క్రేజీగా నిలిచాయి. ముఖ్యంగా అనసూయ చేసిన పని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. `జబర్దస్త్` నుంచి ఏ కారణాలు చెప్పి బయటకు వెళ్లిందే, ఇప్పుడు అంతకు మించి ఆమె వ్యవహరించడమే ఆశ్చర్యంగా మారింది. మరి ఈ షో ద్వారా ఈ లేడీ భామలు ఎలాంటి సందడి చేయబోతున్నారు. ఎంతగా ఎంటర్‌టైన్‌ చేస్తారో చూడాలి. 
 

అయితే స్టార్‌ యాంకర్‌గా రాణించి బుల్లితెరని ఊపేసిన అనసూయ ఇప్పుడు శ్రీముఖి యాంకరింగ్‌లో షోలో పాల్గొనడం విశేషం. ఇందులో మరో జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు కూడా పాల్గొనడం విశేషం. మరి కమ్‌ బ్యాక్‌లో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. 
 

click me!