ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమ్రిత అయ్యర్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులు, ఫాలోవర్స్ ను సరికొత్త ఫొటో షూట్ లతో ఖుషీ చేస్తోందీ అమ్రిత.
తన కేరీర్ ను తొలుత మలియాళంలో ప్రారంభించినా ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్. తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. అయితే తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సరికొత్త ఫొటో షూట్ లు కూడా చేస్తోంది.
ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో కొన్ని కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది ఈ సుందరి. పింక్ కలర్ ట్రెడిషనల్ వేర్ ధరించింది. అప్పటికే క్యూట్ గా ఉండే అమ్రిత ఆ దుస్తుల్లో మరింత అందంగా కనిపిస్తోంది. చూపరులను ఇట్టే ఆకర్షించేలా తన ఆహార్యం కనిపిస్తోంది.
మోహం వెయ్యి దీపాల కాంతితో వెలిగిపోతోంది. కర్నాటకకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చు తెలుగింటికి చెందినదిగానే అనిపిస్తోంది. దీంతో తెలుగు అభిమానులు ఆమె వస్రాధరణకు మరింత ఖుషీ అవుతున్నారు.
అయితే, మలియాళంలో ‘పద్మవ్యోహం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచియమైన ఈ సుందరి, తమిళ్ విజయ్ తళపతి నటించిన ‘బిజిల్’ మూవీలో కీలక పాత్ర పోషించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘రెడ్’ మూవీలో హీరోయిన్ గా నటించింది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకుంది.
ఆ తర్వాత ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఈ మూవీలోని ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ లో ప్రదీప్ మాచిరాజు తో కలిసి ఆడిపాడి లక్షల మంది మన్ననలు పొందింది. ఇటీవల అర్జున ఫాల్గున మూవీలోనూ మెరిందీ బ్యూటీ. ఈ ఏడాది మరో తెలుగు మూవీలో నటిస్తున్నది.