మూవీలోని ‘పుష్ప రాజ్’ మేనేరిజం, పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పటికీ ఏదోరకంగా సినిమా పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో రూ.350 కోట్లతో పార్ట్ 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. ‘పుష్ప2’లోనూ అల్లు అర్జున్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సమంత, ప్రియమణి కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.