సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa). ఈ చిత్రం తాజాగా విడుదల వాయిదా పడింది. ఆగస్టు 15న రిలీజ్ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ సైతం ఈ విషయాన్ని షేర్ చేసారు. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులుకు కోపం వచ్చింది. ఇలా మీ ఇష్టం వచ్చినట్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వెళ్లిపోతే ఎలా ఉంటారు.
సోషల్ మీడియా లో ఈ రిలీజ్ వాయిదా వార్త సెన్సేషన్ అయ్యిపోయింది. కొందరు డైరక్ట్ గా ఎటాక్ చేస్తూంటే మరికొందరు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. తాజాగా ఓ యూజర్ ట్విట్టర్ లో అల్లు అర్జున్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ...సినిమా మొదట జూలై 2024 అన్నారు. ఆ తర్వాత ఆగస్ట్ ..ఇప్పుడు డిసెంబర్ కు షిప్ట్ చేసారు. ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా, ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా. పుష్పకమ్యూనిటీ అంతాకలిసి త్వరగా సినిమా రిలీజ్ చేయమని కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అన్నారు.
Pushpa 2
నిజానికి ఇలా కోర్టుకు వెళ్లాను అన్న వాళ్లు వెళ్లకపోవచ్చు కానీ అభిమానుల ఆవేదన అయితే అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ అభిమాన హీరో,హీరోయిన్ సినిమా వస్తోందంటే అందుకు తగ్గ సన్నాహాలు చేసుకుంటారు. అలాంటిది మరో ఆరు నెలలు దాకా సినిమా రిలీజ్ లేదంటే వాళ్ల పరిస్దితి ఏమిటి. వాయిదా అంటే ఏ నెల రోజులో ఉండాలి కానీ ఇలా ఆరు నెలలు సంవత్సరం అంటే ఎలా అనేది అభిమానులను బాధిస్తున్న విషయం.
ఇక ‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కూ సమయం పడుతుంది. అందుకే ఆగస్టు 15న సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. ఎన్నో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మంచి క్వాలిటీతో చిత్రాన్ని మీకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతోపాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం.
ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. అప్పటికీ సుకుమార్ ప్లాన్ చేసి మూడు యూనిట్ లుగా టీమ్ ని విడతీసి మరీ షూట్ చేస్తున్నారట.వాటిలో రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. 50 రోజుల షూటింగ్ పెండింగ్ అనేది నిజమైతే ఎప్పటికి అవ్వుద్ది? దానికి సంబంధించిన CG, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పటికి పూర్తవుతాయి అనేది పెద్ద ప్రశ్నగా మారే వాయిదా నిర్ణయం తీసుకున్నారట.
ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన ఐటెం సాంగ్ లో చిందులేయనుందని తెలుస్తోంది. మాస్ ఐటెం సాంగ్ దేవి ఇచ్చాడని, థియోటర్స్ ఊగిపోతాయని అంటున్నారు.
పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది.
pushpa2
పుష్పలో ఐకాన్స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేసారు మేకర్స్ . ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియస్గా, పవర్ఫుల్గా కనిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Pushpa2
‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప -2 చిత్రం నుంచి ఏ అప్డేట్ వచ్చినా.. ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ విడుదలైన రికార్డు వ్యూస్తో దూసుకెళ్లింది . టీజర్తో పాటు ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప పుష్పరాజ్, టైటిల్ సాంగ్, కపుల్ సాంగ్గా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ.. ఎంతటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
‘పుష్ప ది రైజ్’ చిత్రంలో తన నటనతో.. మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడమ్ టుసార్ట్స్లో దక్షిణ భారతదేశ నటుడి స్టాట్యూని, గ్యాలరీని ఏర్పాటు చేయటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు ‘పుష్ప’ చిత్రంతోనే సంతరించుకున్నాయి.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి.