అయితే, 'రాకా' సినిమా 'పుష్ప'కు సీక్వెల్ కాదు. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధమే లేదు. కాకపోతే మూవీని తీసే విధానంలో ఉంది. అంటే, పాన్-ఇండియా స్థాయిలో ఆకట్టుకునేలా హీరో-సెంట్రిక్ కథను చెప్పడం. దర్శకుడు అట్లీ డైరెక్షన్లో, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, టైగర్ ష్రాఫ్, రష్మిక మందన్న లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉండబోతోందని సమాచారం. మొత్తానికి, 'రాకా', 'పుష్ప' మధ్య లింక్ కథకు సంబంధించింది కాదు, కేవలం స్ట్రాటజీ, స్టార్ పవర్కు సంబంధించిందని టాక్. `పుష్ప 2`తో ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్గా అల్లు అర్జున్ నిలిచారు. ఇప్పుడు `రాకా`తో ఆయన గ్లోబల్ స్టార్గా నిలబడాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.