Allu Arjun:అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా.. స్నేహా రెడ్డి తండ్రి కామెంట్స్ వైరల్

First Published May 20, 2022, 5:42 PM IST

అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. 

అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. 

అల్లు స్నేహా రెడ్డి తండ్రి కె చంద్ర శేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అల్లుడిగా బన్నీకి 100 మార్కులు వేస్తానని అన్నారు. 

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎదిగాడు. పాన్ ఇండియా స్టార్ గా మారడం సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ చిరంజీవి అడుగు జాడల్లో నడుస్తూ ఎంతో కష్టపడుతున్నారు అని చంద్రశేఖర్ కితాబిచ్చారు. అల్లు అర్జున్.. స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ ఆమె ఆస్తుల విషయంలో ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. 

అల్లు అర్జున్ కట్నంగా ఎంత తీసుకున్నారు అని ప్రశ్నించగా చంద్రశేఖర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ అసలు కట్నమే తీసుకోలేదు.. ఆ అవసరం కూడా లేదు. వాళ్ళకే ఎంతో ఆస్తులు ఉన్నాయి. మనం ఇచ్చేది వాళ్ళకి లెక్క కూడా ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే కట్నం తీసుకోవడం అల్లు అర్జున్ కి ఇష్టం లేదు. దానికి వాళ్ళు వ్యతిరేకం అని చంద్రశేఖర్ అన్నారు. 

2011లో అల్లు అర్జున్, స్నేహ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అల్లు అర్హ, అల్లు అయాన్ సంతానం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో బాగా వర్కౌట్ అయింది. 

దీనితో పుష్ప 2 ని అంతకి మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ నటనతో అదరగొట్టాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!