గతంలో చిరంజీవి మాత్రమే జగన్ తో భేటీ అయ్యారు. ఈసారి చిరుతో పాటు కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వెళ్లనున్నారు. వారిలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ వీరి పేర్లని అధికారికంగా ప్రకటించలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. తారక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాక్.