కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ సినిమాలో అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా కథ, జలియన్వాలా బాగ్ హత్యాకాండ చుట్టూ తిరుగుతుంది. ఈ ఘటనకు బాధ్యుడిగా ఉన్న జనరల్ డయర్పై, బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసే అడ్వొకేట్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) కోర్టులో కేసు వేస్తాడు. అతడికి దిల్రీట్ గిల్ (అనన్య పాండే) అనే యువ అడ్వొకేట్ తోడుంటుంది. మరోవైపు, జనరల్ డయర్ తరపున నెవిల్ మెక్కిన్లీ (ఆర్. మాధవన్) అనే బ్రిటిష్ అడ్వొకేట్ వాదిస్తుంటాడు.