మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబతో పాటు మరికొందరు నటులు, ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్నార్ కూడా భోజనం చేద్దామని లోపలి వెళ్లబోయాడట. ముగ్గురు మరాఠీలు చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్నార్ ని అడ్డగించాడట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వు ఎక్కడికి? నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? క్యాంటీన్ కి వెళ్లి తిను, అని గట్టిగా కసిరాడట.
అవమానభారంతో ఏఎన్నార్ అక్కడ నుండి వెళ్ళిపోయాడట. క్యాంటీన్ లో భోజనం చేశాడట. 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట. ఆ చిత్రానికి దర్శకుడు పి.పుల్లయ్య. నిర్మాత వి. వెంకటేశ్వర్లు. అయితే సూర్యనారాయణ అన్నీ దగ్గరుండి చూసుకునేవారట. సూర్యనారాయణతో పుల్లయ్య.. ఏఎన్నార్ మేకప్ వేసుకోవడం పూర్తి అయితే రమ్మను షాట్ రెడీ అని చెప్పాడట.