Dhanush Aishwarya Divorce : ధనుష్- ఐశ్వర్య ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు..?

First Published Jan 18, 2022, 10:56 AM IST

ఈ మధ్య సినిమా జంటలు ఎక్కువగా విడిపోతున్నారు. కలకాల కలిసి ఉంటారు అనుకున్న అన్యోన్యత కలిగిన కపుల్స్ కూడా.. సడెన్ గా విడాకుల షాక్ ఇస్తన్నారు. ఇలాంటి షాక్ ఇచ్చారు దనుష్- ఐశ్వర్య(Dhanush -Aishwaryaa). అయితే వీరి ప్రేమ , పెళ్ళి గురించి ఐశ్వర్య గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దనుష్ – ఐశ్వర్య రజనీ కాంత్(Dhanush -Aishwaryaa) విడిపోవడం అందరికి షాక్ తగిలినట్టు అయ్యింది.  అభిమానులు అయితే ఈ విషయాన్ని జీర్జించుకోలేక పోతున్నారు.ఇంత మంచిగా ఉంటారు.. పైగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరు విడిపోవడం ఏంటీ అని అందరూ వచిత్రంగా చూస్తున్నారు. ఇది కలా.. నిజమా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.

ప్రస్తుతం వీరి విడాకుల విషయం హాట్ టాపిక్ అవుతుంది. దాంతో అభిమానులు మాత్రం వీరి పెళ్లి.. ప్రేమ.. లైఫ్ స్టైల్ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.  అంతే కాదు ఐశ్వర్య రజనీ కాంత్ 2013లో ఇచ్చిన ఓ ఇంటడర్వ్యూలో వీరి ప్రేమ.. పెళ్లి గురించి చెప్పాన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమ పెళి ఎలా జరిగింది అనన్న దానిపై చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు ఐశ్వర్య రజనీ కాంత్.

తమ పరిచయం గురించి వివరంగా చెప్పింది ఐశ్వర్య. ధనుష్ మూవీ కాదల్ కొండెన్(Kadhal Konden) సినిమా టైమ్ లో ఆల్బర్ట్ థియేటర్ లో వీరికి పరిచయం ఏన్పడింది. ఈ సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లిన ఐశ్వర్యను.. ధనుష్(Dhanush -Aishwaryaa)  కు పరిచయం చేసింది మూవీ టీమ్. తాను రజనీ కాంత్ కూతురునని పరిచయం చేసుకుంది. అంతే కాదు సినిమా చూసి ఇంప్రెస్ అయిన ఆమె ధనుష్ కు అభినందనలు చెప్పింది.

అంతటితో ఆగకుండా.. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా.. ఆతరువాతి రోజు  ధనుష్ (Dhanush) కు ఒక బొకే పంపిస్తూ.. టచ్ లో ఉండమని అడిగిందట. అయితే ఫిల్మ్ కెరీర్ మీద దృష్టి పెట్టిన ధనుష్ ఐశ్వర్యను పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆ పరిచయం తరువాత తరువాత స్నేహంగా మారింది. తరువాత అది ప్రేమగామారిపోయింది. ఆప్రేమ ఆరు నెలల్లో పెళ్ళి వరకూ వచ్చింది.

ఈ విషయాన్ని గతంలో ధనుష్(Dhanush) కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన రెండో సినిమా టైమ్ లో తాము కలుసుకున్నట్టు. తన నటనను ప్రశంసిస్తూ.. ఐశ్వర్య బొకే పంపించడం.. తనను కలుసుకోవడం కోసం ఐశ్వర్య ఇంట్రెస్ట్ చూపించడం.. ఇవన్నీ తమ స్నేహాన్ని.. ఆతరువాత ప్రేమను బలంగా తయారు చేశాయన్ని అన్నారు.

అయితే వీరిద్దరి మనస్తత్వాలు.. ఆలోచనలు వేరు. అయినా సరే ఒకరి ఆలోచనలకు మరొకరు విలవ ఇచ్చుకుంటూ.. ఒకరికి మరొకరు స్పేస్ ఇస్తూ.. దాదాపు 18 ఏళ్ళు కలిసి బ్రతికారు. 2004 నవంబర్ 14న వీరి పెళ్ళి జరిగింది. వీరికి యాత్రా రాజా, లింగరాజా అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరి మనస్తత్వాలు వారివి కావడంతో.. అదే అభిప్రాయాలను గౌరవిస్తూ.. ఇద్దరు విడిపోవాలని నిర్ణాయించుకున్నట్టు తెలిపారు ఈ జంట.

click me!