నటుడిగా రాణిస్తున్న సమయంలో తాగుడికి బానిసయ్యాడు రాజేష్. విపరీతంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. లివర్ డ్యామేజ్ అయ్యింది. దీంతో తన 38ఏళ్ల వయసులోనే కన్నుమూశారు రాజేష్. అప్పటికే ఐశ్వర్య రాజేష్ ఏజ్ ఎనిమిదేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తండ్రి మరణంతో తల్లి నాగమణినే అంతా చూసుకుంది. పెంచి పెద్ద చేసింది. హీరోయిన్ని చేసింది.
ఐశ్వర్యా రాజేష్ తమిళంలో హీరోయిన్గా రాణిస్తుంది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆ మధ్య `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాలు చేసింది. ఇప్పుడు వెంకటేష్ సరసన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది.
read more: వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ రివ్యూ
also read: `గేమ్ ఛేంజర్` రిజల్ట్ పై ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ స్పందన.. పోస్ట్ వైరల్, ఏమన్నాడంటే?