శోభన్ బాబుతో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. సుహాసిని తాజాగా ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుహాసిని మాట్లాడుతూ నేను నాగార్జున, వెంకటేష్ ఇద్దరితో ఒక్కో చిత్రం మాత్రమే చేశాను. చిరంజీవి, బాలకృష్ణతో అయితే చాలా సినిమాలు చేశాను. అందరికంటే నేను ఎక్కువగా నటించింది శోభన్ బాబు గారితోనే అని సుహాసిని తెలిపింది.