ప్రేమించిన వ్యక్తి మోసం చేసి పోతే ఉండే బాధ బాగా తెలుసు...రేణూ సంచనల వ్యాఖ్యలు

First Published Nov 27, 2020, 12:19 PM IST

స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన సమయంలో పవన్ ప్రేమలో పడి కెరీర్ ని వదిలేసింది రేణూ దేశాయ్. ఇద్దరు పిల్లలతో సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు రావడంతో విడిపోయారు. పిల్లలతో ఒంటిగా ఉంటున్న రేణూ దేశాయ్ కెరీర్ పై మళ్ళీ దృష్టి పెట్టారు. నటిగా, దర్శకురాలిగా ఆమె రాణించాలని ప్రణాళికలు వేస్తున్నారు. 

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణూ, వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై ఆమె తన అభిప్రాయం తెలియజేశారు.
undefined
జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. లవ్ లో ఫెయిల్ అయితే కలిగే బాధ నాకు బాగా తెలుసు. లవ్ చేసినవారు మనతో లేకుండా, మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడనే ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయి, అన్నారు.
undefined
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, ప్రేమ దక్కలేదని ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. వైద్యుల కౌన్సిలింగ్‌ తీసుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వంటి విధానాల ద్వారా ఆ పరిస్థితి నుండి బయటపడవచ్చని రేణూ సలహా ఇచ్చారు.
undefined
ప్రస్తుతం రేణూ ఆద్య అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఆద్య లో రేణూ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారట. ఆ పాత్ర తనకు నాకు బాగా నచ్చినట్లు చెప్పడం గమనార్హం.
undefined
కొద్దిరోజుల క్రితం రేణూ దర్శకుడు పూరి ని తన సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని కోరారు. మహేష్ మూవీలో కూడా నటించాలని ఉందని ఆమె చెప్పడం విశేషం.
undefined
ఇక ఆద్య వెబ్ సిరీస్ తో పాటు మరొక సిరీస్ లో నటించడానికి రేణూ సైన్ చేశారట. ఆ ప్రాజెక్ట్ విశేషాలు త్వరలో వెల్లడిస్తానని రేణూ అభిమానులతో చెప్పారు.
undefined
రైతులను ఉద్దేశించి తన దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియా ఛాట్ లో చెప్పారు.
undefined
అలా కెరీర్ పై ఫోకస్ పెట్టి ముందుకు వెళుతుంది రేణూ దేశాయ్. చాలా కాలంగా పిల్లలు అకీరా, ఆద్యలతో పూణేలో ఉంటున్న రేణూ దేశాయ్, హైదరాబాద్ కి మకాం మార్చినట్లు సమాచారం.
undefined
click me!