రెండ్రోజుల్లో చనిపోయే పాప కోసం స్మశానానికి వెళ్లాం.. సభ్యులకు తన కన్నీటి గాధ చెప్పిన ప్రియ

First Published Sep 8, 2021, 11:21 PM IST

బిగ్ బాస్ 5లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆర్జే కాజల్ గలగలా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నటి ప్రియతో.. అంట్లు తోమడం నావల్ల కాదు అని చెబుతుంది.

బిగ్ బాస్ 5లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆర్జే కాజల్ గలగలా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నటి ప్రియతో.. అంట్లు తోమడం నావల్ల కాదు అని చెబుతుంది. మనం ఇక్కడ ఉంటున్నప్పుడు ఒక్కోపని అలవాటు చేసుకోవాలి అని ప్రియా అంటుంది. 

ఇక లహరి, హమీద మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో ఎమోషనల్ అయిన లహరి కంటతడి పెట్టుకుంది. తర్వాత హౌస్ లో కాస్త వినోదాత్మక సంఘటనలు జరుగుతాయి. సిరిని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ పిలుస్తారు. ఆమెకి బిగ్ బాస్ ప్రత్యేక పవర్స్ ఇస్తారు. దీని ప్రకారం ఇద్దరు సభ్యులని ఎంచుకోమని బిగ్ బాస్ సిరికి చెబుతారు. ఇద్దరిలో ఒకరు యజమాని, మరొకరు సర్వెంట్. యజమాని చెప్పినట్లు సర్వెంట్ నడుచుకోవాలి. దీని కోసం యజమానిగా షణ్ముఖ్ ని, సర్వెంట్ గా లోబోని సిరి ఎంచుకుంటుంది. 

షణ్ముఖ్ చెప్పినట్లు లోబో నడుచుకోవాలి. ఈ విషయాన్ని సిరి బయటకు వచ్చి వారిద్దరికీ చెబుతుంది. దీనితో షణ్ముఖ్ యజమానిగా మారి లోబోకి ఆర్డర్స్ వేస్తుంటాడు. హౌస్ లో ఉండే సభ్యులలాగా మిమిక్రి చేయమని షణ్ముఖ్ లోబోని ఆదేశిస్తాడు. లోబో అద్భుతంగా మిమిక్రి చేస్తాడు. ఆ తర్వాత లోబోని బాత్రూం వద్ద షణ్ముఖ్, రవి ఆడేసుకుంటారు. బట్టలు ఉతకమని, బకెట్ కడగమని చెబుతారు. రేయ్ రవి అంతకు అంత తీర్చుకుంటారా అంటూ లోబో రవికి సరదాగా వార్నింగ్ ఇస్తాడు. 

 ఇక హౌస్ లో ఓ ఎమోషనల్ సీన్.. ప్రియా తన పాప ఎలా మరణించిందో కొంతమంది సభ్యులకు కంటతడి పెట్టుకుంటూ వివరిస్తుంది. మాపాపకు క్యాన్సర్. చాలా క్యూట్ గా మాట్లాడేది. రెండ్రోజుల్లో చనిపోతుందని తెలుసు. పాప చనిపోయే రెండురోజుల ముందు స్మశానం మాట్లాడానికి వెళ్లాం. అది కోవిడ్ టైం.. అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టం. అందుకే ముందుగా మాట్లాడడానికి వెళ్లాం. 

పాప బతికి ఉండగానే స్మశానానికి వెళ్లి.. తిరిగి వచ్చి చూస్తే పాప చిరునవ్వుతో కనిపించేది. ఆ క్షణంలో నాభాధ ఎలా ఉండేదంటే.. కడుపు లోపల నలిపేసినట్లు ఉండేది అంటూ ప్రియా కన్నీరు పెట్టుకుంది. ఇంటి సభ్యులు ఆమెని ఓదార్చారు. 

ఇక నేటి ఎపిసోడ్ చివర్లో నటి ఉమాదేవి రచ్చతో ముగుస్తుంది. ఆలు కర్రీ కోసం ఉమాదేవి.. ప్రియా, సరయు, అనీ మాస్టర్ లతో గొడవ పడుతుంది. అందరికి ఒకే కూర వండాలి. కొందరికి ఒక కూర.. ఇంకొందరికి మరో కూర ఏంటి అం ఉమా దేవి విరుచుకుపడుతుంది. అనీ మాస్టర్ మాత్రం ఏదైనా తప్పు జరిగిఉంటే క్షమించాలి అని కోరుతుంది. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. 
 

click me!