ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది. చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు వస్తున్నాయి. కానీ పాతికేళ్ల కృతేమే ఓ లెజెండ్రీ తెలుగు డైరెక్టర్ ఆడియన్స్ ని తన విజువల్స్ మాయాజాలంలో ముంచేయాలని ఎంతో శ్రమించేవారు. అందుకే ఆయన దర్శకత్వం నుంచి అమ్మోరు, దేవి, దేవి పుత్రుడు లాంటి అద్భుత చిత్రాలు జాలువారాయి.