అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా అభిమానులకు గుర్తుండిపోయేవారో.. జమున, మహానటి సావిత్రి కూడా అంతే. వీరిద్దరూ మిస్సమ్మ, గుండమ్మ కథ కలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ లో కలసి నటించిన సంగతి తెలిసిందే. మహానటి సావిత్రితో తన అనుబంధాన్ని జమున ఎప్పుడూ గుర్తు చేసుకునే వారు. సావిత్రి సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి తనకి పూర్తి అవగాహన ఉంది అని జమున అంటుంటారు.