ఇక ప్రస్తుతం ది గోట్ లైఫ్ ‘ఆడుజీవితం’ అనే మలయాళ చిత్రంతో సెన్సేషన్ గా మారారు. మార్చి 28న విడుదల కాబోతుండగా గట్టిగా ప్రమోషన్ నిర్వహిస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేస్తున్నారు.
ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ చిరంజీవికి నో చెప్పిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ‘ఆడు జీవితం’ సినిమా కోసమే చిరంజీవి గారి సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీ రోల్ వదులుకున్నాను. అప్పుడు నన్ను అడిగారు. ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నా అందుకే నటించలేకపోతున్నా అని మెగాస్టార్ కు వివరించాను.
ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ ‘గాఢ్ ఫాదర్’ ను నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పుడూ ‘గోట్ లైఫ్’ సినిమా కంటిన్యూ చేస్తూ ఉండటంతో మళ్లీ కాదన్నాను. దీంతో నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అని చిరు అన్నారు. నాకు ఆయన సినిమాలో నటించడం ఎంతో ఇష్టమని కానీ కుదరలేదని చెప్పాను. ఫ్యూచర్ లో అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది.
ఇక ‘ఆడుజీవితం’ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను 2009లో ఫిక్స్ అయ్యి.. 2018లో షూటింగ్ ను ప్రారంభించామని తెలిపారు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుందని తెలిపారు. ఈ సినిమా కోసం 31 కిలలో బరువు కూడా తగ్గానని చెప్పారు.