ఎన్టీఆర్ తో బృందావనం, చరణ్ తో ఎవడు, నాగార్జునతో ఊపిరి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారసుడు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరక్టర్ వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మాతగా అమీర్ ఖాన్ తో తెలుగు, హిందీ లలో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వినికిడి. అమీర్ ఖాన్ కి కూడా ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందని, కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కు తోంది అని వినిపిస్తోంది. అన్ని ఓకే అయితే ఈ లేటెస్ట్ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.