తెలుగు నటి, అలనాటి హీరోయిన్ ఆమని ఫ్యామిలీ కథా చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఎక్కువగా ఆమె ఫ్యామిలీ స్టోరీ సినిమాలతోనే మెప్పించింది. ఇంట్లో ఇల్లాలి పాత్రలకు కేరాఫ్గా నిలిచిందని చెప్పొచ్చు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆమెని హీరోయిన్గా, స్టార్ హీరోయిన్ గా చేశాయి.
1990లో `పుతియకాట్రు` అనే తమిళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఆమని. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `మిస్టర్ పెళ్లాం` సినిమాతోనే ఉత్తమ నటిగా నంది అవార్డుకి పోటీ పడింది. `పచ్చని సంసారం`, `శుభలగ్నం`, `అల్లరి పోలీస్`, `హలో బ్రదర్`, `ఘరానా బుల్లోడు`, `శుభ సంకల్పం`, `శుభమస్తు`, `మావిచిగురు`, `ఆ నలుగురు` చిత్రాలతో అలరించింది.
పెళ్లి చేసుకున్నాక హీరోయిన్గా కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత 2012 మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కొనసాగుతుంది. చిన్నా, పెద్ద అన్నిరకాల మూవీస్ చేస్తుంది. ఇటీవల `మ్యూజిక్ షాప్ మూర్తి` చిత్రంలో మెరిసింది ఆమని. ఇదిలా ఉంటే తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఆమని.
అందులో భాగంగా తన అబార్షన్స్ గురించి ఓపెన్ అయ్యింది. తనకు ఏకంగా ఆరు ఆబార్షన్స్ అయినట్టు వెల్లడించి షాకిచ్చింది. తాను హీరోయిన్గా చేసేటప్పుడు చాలా డైట్ చేసేదట. చాలా తక్కువగా తినేదట. మార్నింగ్ జస్ట్ జ్యూస్లు తాగేదట. తన డైట్ చూసి దాసరి నారాయణరావు కూడా తిట్టేవాడట. హెల్త్ విషయంలో ఎక్కువగా కాన్షియస్గా ఉండేదట. షూటింగ్ల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాను ఆ జాగ్రత్తలు తీసుకునేదట.
దీని కారణంగా తనకు బ్లడ్ డెఫీషియన్సీ వచ్చిందట. ప్రోటీన్ ఎస్ అనేది తక్కువగా ఉందట. అదేంటో అప్పుడు తెలియలేదని, ఏ డాక్టర్ కూడా గుర్తించలేకపోయారని తెలిపింది. దీని కారణంగా పిల్లలు పుట్టలేదని, అలా తాను ఆరు సార్లు అబార్షన్ అయినట్టు చెప్పింది. తనకు ఎందుకు గర్భం నిలవడం లేదో అర్థం కాలేదని, డాక్టర్లు కూడా షాక్ అయ్యేవారని, ఓ డాక్టర్ మాత్రం ఏకంగా తన సమస్య అర్థం కాక తలపట్టుకుందని, నా కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదని, మీ విషయంలో ఓడిపోయామని కూడా చెప్పారట.
ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రులకు తిరగ్గా ఓ డాక్టర్ గుర్తించారని తెలిపింది ఆమని. ఆ సమస్యని కనిపెట్టేంత వరకు నాకు పిల్లలు కావాలని దేవుడుని వేడుకునేదట. సమస్యని గుర్తించాక ట్రీట్మెంట్ తీసుకున్నానని, ఆ తర్వాత సెట్ అయ్యిందని, పిల్లలు పుట్టినట్టు తెలిపింది ఆమని. ఇలా ఆరు సార్లు అబార్షన్ కారణంగా తాను నరకం చూసినట్టు చెప్పింది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక చాలా మానసిక వేదన అనుభవించిందట. ఏడో గర్భం నిలబడిందని చెప్పింది.