ఇందులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్తోపాటు జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, శ్రీ ప్రియా, నదియా, సుహాసిని, రమ్యకృష్ణన్, జయసుధ, సుమలత, రెహ్మాన్, ఖుష్బూ, భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరాం, అశ్వతి జయరాం, సరితా, భానుచందర్, మీనా, లతా, స్వప్నా, జయశ్రీ, రాధ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇది నిర్వహించారు. గతేడాదినే కలవాలని భావించారు. కానీ చెన్నైలో వరదల కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ శనివారం అందుకు వేదికగా మార్చారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, 80 నాటి ప్రియమైన స్నేహితులతో కూడిన ఈ రీయూనియన్ జ్ఞాపకాల మార్గంలో ఒక నడకలా ఉంటుంది. నవ్వు, వెచ్చదనం, దశాబ్దాలుగా మనం పంచుకున్న అదే విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది. చాలా అందమైన జ్ఞాపకాలు అయినప్పటికీ ప్రతి సమావేశం మొదటి మీటింగ్ లాగే ఫ్రెష్గా అనిపిస్తుంది` అని చిరంజీవి ట్వీట్ చేశారు. సుహాసిని, లిస్సీ, ఖుష్బూ సైతం తమ ఆనందాలను పంచుకున్నారు.