ఆ హిట్ కోసం 4ఏళ్ళు ఎదురుచూసిన ఎన్టీఆర్..!

First Published Aug 15, 2020, 3:56 PM IST

ఎన్టీఆర్ కెరీర్ అతిపెద్ద విజయం సాధించిన చిత్రాలలో యమదొంగ ఒకటి. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ ని పరాజయాల నుండి బయటపడేసింది. ఎన్టీఆర్ యంగ్ యముడిగా నటించిన ఈ చిత్రం విడుదలై 13ఏళ్ళు అవుతుంది. 
 

2001లో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ రెండేళ్ల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాడు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది బ్లాక్ బస్టర్ కాగా, 2003లో రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీనితో టీనేజ్ ముగిసేనాటికె ఎన్టీఆర్ స్టారై పోయాడు.
undefined
ఐతే సింహాద్రి వలన వచ్చిన స్టార్ డమ్ ఇమేజ్ ఎన్టీఆర్ కి శాపంగా మారింది. ఆ తరువాత ఆయన నుండి వచ్చిన చిత్రాలన్నీ వరుస పరాజయాలు పొందాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా అట్టర్ ప్లాప్ కాగా వివి వినాయక్ తెరకెక్కించిన సాంబ యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన నాఅల్లుడు, నరసింహుడు పరాజయం పాలయ్యాయి. రాఖి మాత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.
undefined
సింహాద్రిలాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత ఎన్టీఆర్ ఏ చిత్రం చేసినా జనాలకు నచ్చలేదు. దీనితో వరుస పరాజయాలునాలుగేళ్లు ఎన్టీఆర్ ని వెంటాడాయి. దానికి తోడు ఎన్టీఆర్ భారీగా బరువు పెరగడంతో పాటు అసలు చూడలేనంతఘోరంగా తయారయ్యారు.
undefined
ఈ గ్యాప్ లో రాజమౌళి సై, ఛత్రపతి, విక్రమార్కుడు అనే మూడు బ్లాక్ బస్టర్స్ నమోదుచేశారు. దీనితో ఎన్టీఆర్ ని కాపాడాలంటే రాజమౌళి రావాల్సిందేఅని ఫ్యాన్స్ఫిక్సయ్యారు. ఆ సమయంలోనేరాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ యమదొంగఅనౌన్స్మెంట్ జరిగింది.
undefined
సోసియో ఫాంటసీ చిత్రంగా ఆగష్టు 15, 2007న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ కోసం పూర్తిగా సన్నబడిన ఎన్టీఆర్ కొత్త అవతారంలో దర్శనం ఇచ్చారు. దొంగగా మరియు యంగ్ యముడిగా ఎన్టీఆర్ నటన అధ్బుతం అని చెప్పాలి.
undefined
బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎన్టీఆర్ దాహాన్ని తీర్చింది. మోహన్ బాబు యముడిగాచేసిన ఈ మూవీలో ప్రియమణిహీరోయిన్ గా నటించింది. 2007 టాలీవుడ్హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ మూవీ ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ లోకి తెచ్చింది.
undefined
click me!