మహేశ్ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం.. అభిమానులు తప్పక తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్!

First Published Nov 29, 2022, 5:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు, ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేశ్ సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగడానికి ఈరోజే ప్రధానం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియాలోనే బిగ్ స్టార్ గా మహేశ్ గుర్తింపు పొందారు. అయితే మహేశ్ కేరీర్ ప్రారంభం నుంచి మొన్న రిలీజ్ అయిన ‘సర్కారు వారి పాట’ వరకు సాగిన జర్నీ రిమార్కబుల్ అనే చెప్పాలి. 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి నేడు సూపర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 27 ఏడు సినిమాల్లో నటించిన మన మహేశ్ బాబు. తనదైన సినిమాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ కు ఈరోజు చాలా ప్రత్యేకమైంది. 
 

Latest Videos


ఇంతకీ విషయం ఏంటంటే.. మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరి మనస్సులను దోచుకుంది.. తన సినీ ప్రయాణానికి పునాది పడింది ఈరోజే. దర్శక రత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన ‘నీడ’(Needa)అనే చిత్రంలో తొలిసారిగా మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
 

1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ గా అదరగొట్టారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే  దక్కింది. మరోవైపు మహేశ్ బాబు కూడా చక్కగా నటించడంతో వెన్వేంటనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆఫర్లు  అందుకున్నారు.
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం 9 చిత్రాల్లో మహేశ్ బాబు నటించడం విశేషం. అందులో క్రిష్ణ (Krishna)తో కలిసి ఏడు చిత్రాల్లో నటించి మెప్పించాడు. సరిగ్గా 43 ఏండ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు.. చిన్నప్పటి ఫోలను షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు. 
 

చిన్నప్పటి నుంచే సినిమా ప్రపంచంలో పెరిగిన మహేశ్ బాబుకు సినిమానే ప్రపంచంగా మారింది.  ‘రాజా కుమారుడు’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మహేశ్.. ఎప్పుడూ సినిమా పట్ల, సినీ ఇండస్ట్రీలోని పెద్దల పట్ల, తెలుగు ప్రేక్షకుల పట్ల తప్పుడుగా నడుచుకోలేదు. క్రమశిక్షణతో, నిబద్ధతతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఫలితంగా ఈరోజు టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం దక్కిచుంకున్నారు. ఇందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతన్నారు. 
 

అయితే, 2022 మాత్రం మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు నెలకొనడం చాలా బాధాకరం. అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా  దేవి, రీసెంట్ గా తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ చనిపోవడంతో పుట్టెడు  శోకంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇక నిన్న క్రిష్ణ దశదిన కర్మను జరిపించారు. అభిమానులకూ భోజనాలు  ఏర్పాటు చేయించారు. ఇక తండ్రి స్ఫూర్తితోనే ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలనూ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం మహేశ్ బాబు భారీ  చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా  ‘సర్కారు వారి పాట’తో అలరించగా.. నెక్ట్స్ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రారంభించారు. ‘ఎస్ఎస్ఎంబీ 28’ వర్క్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.  త్వరలో మళ్లీ  పున:ప్రారంభం కానుంది. ఈ చిత్రం తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో భారీ అడ్వెంచర్ లో నటించబోతున్నారు.
 

click me!